Supreme Court : 68 మంది గుజరాత్ జుడిషియల్ అధికారుల ప్రమోషన్పై సుప్రీంకోర్టు స్టే
68 మంది జుడిషియల్ అధికారులను ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Supreme Court (3) (1)
Supreme Court : గుజరాత్ రాష్ట్రానికి చెందిన 68 మంది జుడిషియల్ ఆఫీసర్ల ప్రమోషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. 68 మంది జుడిషియల్ ఆఫీసర్లను ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెల్లడించింది. మెరిట్ లేదా సీనియారిటీ చూడకుండా జుడిషియల్ అధికారులకు ప్రమోషన్ ఇవ్వడం సరికాదని తెలిపింది.
Delhi Government: కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో సీటీ రవి కుమార్ కూడా ఉన్నారు. అలాగే ఇటీవల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వేసిన మెజిస్ట్రేట్ హరీశ్ హస్ ముక్ భాయ్ వర్మ కూడా ఆ జాబితాలో ఉన్నారు. 68 మంది జుడిషియల్ అధికారులను ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.