Supreme Court : మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.

Supreme Court : మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court

Supreme Court : దేశంలో పలువురు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని తెలిపింది. 2017లో ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై న్యాయమూర్తులు కేఎం జోసఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో ఓ మహిళ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. హిందువైన తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని 2008లో హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నానని, కానీ అతను ఇప్పుడు మరో వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. హిందూ వివాహ చట్టం 494 సెక్షన్ కింద అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Supreme Court : ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..వారిచ్చే వివాహ ధ్రువపత్రం చెల్లదు

అయితే దీనిపై సదరు వ్యక్తి స్పందిస్తూ తాను క్రైస్తవుడినని, హిందూ వివాహ చట్టం తనకు వర్తించదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు చూపనందుకు కేసును కొట్టి వేయాలని కోరారు. దీనికి హైకోర్టు నిరాకరించడంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.