Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. 83వ రోజుకు చేరుకున్న యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. 83వ రోజుకు చేరుకున్న యాత్ర

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఈ యాత్రలో సినీ నటి స్వర భాస్కర్ కూడా పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి యాత్రలో నడిచారు. అలాగే ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ కూడా యాత్రలో చేరారు.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

వీరిద్దరూ రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. గత సెప్టెంబర్ 7న మొదలైన యాత్ర 83వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో యాత్ర పూర్తైంది. మరో 1,209 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయాల్సి ఉంది. రాహుల్ చేపట్టిన ఈ యాత్రలో పలువురు సినీ తారలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొంటున్నారు. ఇంతకుముందు రాహుల్ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాల్లో 3,750 కిలోమీటర్లు సాగేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది.