లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు

భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన  ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 09:55 AM IST
లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు

భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన  ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.

అహ్మదాబాద్ : భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, అనంతరం పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన  ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది. పాక్ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలపై దాడి చేసే అవకాశం ఉన్న క్రమంలో బీఎస్ఎఫ్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ సరిహద్దునకు 20 కిలోమీటర్ల దూరంలో బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసారి, శివనగర్ గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలిగించవద్దని బీఎస్ఎఫ్ గ్రామీణ ప్రజలకు ఆదేశించింది.
Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

మేఘపురా, రండోసాన్ గ్రామాల్లోనూ రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలిగించవద్దని ఆదేశించిన బీఎస్ఎఫ్ గ్రామాల గోడలపై హెల్ప్ లైన్ నంబర్లను పెయింట్ చేసింది. బీఎస్ఎఫ్ ఆదేశం మేర తాము రాత్రివేళ గ్రామంలో విద్యుత్ దీపాలు స్వీచాఫ్ చేశామని రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ తెలిపారు. లైట్స్ వేస్తే గుర్తించి ఉగ్రవాదులు దాడులకు  తెగబడతారని స్విచ్ ఆఫ్ చేస్తున్నామని తెలిపారు. 

సరిహద్దు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే బీఎస్ఎఫ్ కు సమాచారం అందించాలని కమాండెంట్ గ్రామస్థులను కోరారు. పాక్ సరిహద్దు కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే తమ మేఘపూర్ గ్రామం నుంచి 20కిలోమీటర్ల దూరం ఉన్నా అటవీ మార్గం గుండా వెళితే కేవలం సరిహద్దు కిలోమీటరు దూరంలోనే ఉందని సర్పంచ్ చౌహాన్ పేర్కొన్నారు. మొత్తంమీద ఇండో-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతతో సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
Also Read : ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఆహారం ఇచ్చిన పంజాబ్ పోలీసులు