TamilNadu: మూడో భర్త పెట్టిన పరీక్షలో గెలవాలని కన్నబిడ్డకు నిప్పంటించిన తల్లి

మూడో భర్త ముందు పాతివ్రత్యం నిరూపించుకునేందుకు కన్నబిడ్డకే నిప్పంటించింది ఓ మహిళ. 75శాతం కాలిన గాయాలకు తిరువొట్టియూర్ లోని హాస్పిటల్ లో చిన్నారి చికిత్స తీసుకుంటూనే కనుమూసింది.

TamilNadu: మూడో భర్త పెట్టిన పరీక్షలో గెలవాలని కన్నబిడ్డకు నిప్పంటించిన తల్లి

Visakha Girl Died

TamilNadu: మూడో భర్త ముందు పాతివ్రత్యం నిరూపించుకునేందుకు కన్నబిడ్డకే నిప్పంటించింది ఓ మహిళ. 75శాతం కాలిన గాయాలకు తిరువొట్టియూర్ లోని హాస్పిటల్ లో చిన్నారి చికిత్స తీసుకుంటూనే కనుమూసింది. ఘటనపై కేసు నమోదుచేసి జయలక్ష్మిని, ఆమె మూడో భర్త పద్మనాభన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

జయలక్ష్మి 19ఏళ్ల వయస్సులో పల్వన్ణన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వారిద్దరికీ ఓ బాలిక పుట్టగా తన పుట్టింటిలో వదిలేసింది. కొన్నేళ్లకు పల్వనన్ ను వదిలేసిన అతని తమ్ముడు దురైరాజ్ ను పెళ్లాడి ముంబైకి వెళ్లిపోయింది. అక్కడే పవిత్ర పుట్టింది.

రెండో భర్తను కూడా వదిలేసి పవిత్రను తీసుకుని చెన్నైకు వచ్చేసింది జయలక్ష్మి. తిరువొట్టియూర్ ప్రాంతంలో సెటిల్ అయి పద్మనాభన్ ను తొమ్మిదేళ్ల క్రితం పెళ్లాడింది. వీరిద్దరికీ సంతానంగా ఆరేళ్లు, నాలుగేళ్ల వయస్సున్న పిల్లలు పుట్టారు.

Read Also : హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్టర్ కిడ్నాప్

పద్మనాభన్ ను తరచూ తాగి రావడం ఆమెను అనుమానిస్తుండటం గొడవలు జరుగుతుండేవట. ఆదివారం కూడా ఇదే విషయంలో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాదన మధ్యలో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలంటే పవిత్రకు నిప్పు పెట్టాలని.. నిజంగా జయలక్ష్మి అమాయకురాలే అయితే పాపకు ఏ హానీ జరగదంటూ రెచ్చగొట్టాడు.

పవిత్ర నిద్రపోతున్న గదిలోకి వెళ్లి లాక్కొచ్చిన జయలక్ష్మి కిరోసిన్ ఒంటిపై పోసి నిప్పు పెట్టింది. బాలిక అరుపులకు స్థానికులు వచ్చి చూసేసరికి మంటల్లో చిన్నారి కేకలు పెడుతూ కనిపించింది. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించేసరికి కాలిన గాయాలతో మృతి చెందింది.