గుడికి వెళ్లక్కర్లా : పూజలు..అభిషేకాలు..Liveలోనే..ఇంటినంచే దణ్ణం పెట్టేసుకోండి

  • Published By: nagamani ,Published On : May 22, 2020 / 09:56 AM IST
గుడికి వెళ్లక్కర్లా : పూజలు..అభిషేకాలు..Liveలోనే..ఇంటినంచే దణ్ణం పెట్టేసుకోండి

కరోనా మనిషి జీవనశైలినే కాదు దేవుళ్లకు జరిగే సేవలకు కూడా స్టాప్ బోర్డు చూపించేసింది. అన్ని దేవాలను మూసి వేసే పరిస్థితి తెచ్చింది కరోనా. కరోనా కట్టడిలోభాగంగా లాక్ డౌన్ లో దేశంలోని దాదాపు అన్ని దేవాలను మూతపడ్డాయి. 

ఈ క్రమంలో లాక్ డౌన్ సడలింపులు జరుగుతున్నక్రమంలో దేవాలయాల్లో నిర్వహించే పూజా కార్యాక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.  కానీ ఆలయాల్లో భక్తుల రద్దీ ఉండకుండా చూసుకోవాలని కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే యోచనలో ఉంది. 

ఈ  సమాచారాన్ని భక్తులకు తెలియజేయటానికి..ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించడానికి ఓ యాప్‌ను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అమలులోకొస్తే..భక్తులు గుడికి రానక్కర్లేదు. ఇంటినుంచే భగవంతుడికి దణ్ణం పెట్టేసుకోవచ్చన్నమాట. చూసారా..కలికాలం..కాదు కాదు కరోనా కాలం..ఎంత పనిచేసింది. 

Read: ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం