Terrorist Killed : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.

Terrorist Killed : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

Terrorist Killed

Terrorist Killed : జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు లష్కరే తొయీబా ఉగ్రవాదిని హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు సెర్చ్ ఆపరేషన్ బృందాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని జిల్లా ఎస్పీ అమోద్ అశోక్ పేర్కొన్నారు.

అతడిని లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని చెప్పారు. కశ్మీర్ లో జీ-20 సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అయితే, బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.

jammu kashmir Encounter : జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం

రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడం విశేషం. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రిరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులు జవాన్లపై పేలుడు పదార్ధం విసిరారని ఆర్మీ తెలిపింది. ఇటీవల జమ్మూ రీజియన్ లో ఆర్మీ ట్రక్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Shopian Encouter : ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం

జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఉదంపూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. కాగా, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీనియర్ అధికారి తెలిపారు. అదనపు బలగాలను రప్పించామని పేర్కొన్నారు.