Terrorists : కశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులు..అధికారి మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్‌ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Terrorists : కశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులు..అధికారి మృతి

Srinagar

Terrorists  జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్‌ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఖన్యార్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ప్రొబేషనరీ సబ్ ఇన్స్‌స్పెక్టర్ అర్షిద్ అహ్మద్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసును.. స్థానిక ఎస్​ఎంహెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారని అధికారులు తెలిపారు.

కాల్పుల జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు