Mother Attack Son : భర్తపై కోపంతో రెండేళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన తల్లి

తమిళనాడులో దారుణం జరిగింది. బిడ్డ పాలిట తల్లి శాడిస్ట్ గా మారింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Mother Attack Son : భర్తపై కోపంతో రెండేళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన తల్లి

Attack

mother attack son : తమిళనాడులో దారుణం జరిగింది. బిడ్డ పాలిట తల్లి శాడిస్ట్ గా మారింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం..చిత్తూరు జిల్లాకు చెందిన తులసి తన బిడ్డతో కలిసి విల్లుపురం జిల్లా సత్యమంగళం మెట్టూరులో నివాసం ఉంటుంది.

అయితే భర్తతో విభేదాల కారణంగా బిడ్డతో కలిసి తులసి వేరుగా ఉంటోంది. భర్తపై కోపంతో తులసి తన రెండేళ్ల బాలుడు ప్రదీప్ ను చిత్రహింసలకు గురి చేసింది. బిడ్డను హింసిస్తూ ఆ దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించి భర్తకు పంపింది. బిడ్డను చావబాదుతూ వందలాది వీడియోలు తీసినట్లు గుర్తించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడు ప్రదీప్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చించారు. తల్లి తులసి పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. తులసిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. తులసి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.