Mundra Port Drugs : ఎన్‌ఐఏ చేతికి ముంద్రా పోర్ట్‌ డ్రగ్స్‌ కేసు విచారణ

ముంద్రా పోర్ట్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించే యోచనలో కేంద్రం ఉంది. అనేక రాష్ట్రాలు, ముఖ్యులతో ఈ కేసు ముడిపడి ఉండటంతో ఎన్ఐఏతో విచారణ చేసేందుకు మొగ్గుచూపుతోంది.

Mundra Port Drugs : ఎన్‌ఐఏ చేతికి ముంద్రా పోర్ట్‌ డ్రగ్స్‌ కేసు విచారణ

Mundra Drugs

NIA investigate Mundra Port drugs case : ముంద్రా పోర్ట్‌ డ్రగ్స్‌ కేసు విచారణను ఎన్‌ఐఏ చేపట్టనుంది. ముంద్రా పోర్ట్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అనేక రాష్ట్రాలు, ముఖ్యులతో ఈ కేసు ముడిపడి ఉండటంతో .. కేంద్ర దర్యాప్తు సంస్ధతో విచారణ చేసేందుకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే డీఆర్‌ఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌.. మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి .. దర్యాప్తు చేస్తున్నాయి. ఏపీ విజయవాడలోని ఆశి ట్రేడింగ్‌ కంపెనీ కేంద్రంగా దందా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంస్థ పేరుతోనే పెద్ద ఎత్తున దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా జరిగింది. ఇప్పటికే అశి సంస్థ నిర్వాహకులు సుధాకర్, వైవాలిని గుజరాత్‌లో విచారిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే అఫ్ఘానిస్తాన్‌లో కాంధర్ నుంచి 2 కంటైనర్లు రోడ్డు మార్గంలో బయల్దేరాయి. అవి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా సముద్రమార్గంలో ఈ నెల 13న గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్నాయి. కంటైనర్లలో ఉన్న సరుకును రికార్డుల్లో మాత్రం సెమీ ప్రాసెస్డ్ టాల్కం స్టోన్స్ గా పేర్కొన్నారు. బస్తాల్లో ఉన్న ఆ సరుకు తెరిచి చూసినా, పైన టాల్కం రాళ్లు మాత్రమే కనిపించేలా ప్యాకింగ్ చేశారు. అఫ్ఘానిస్తాన్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకునే వస్తువే కావడంతో సాధారణంగా ఎవరికీ అనుమానం రాదు. కానీ, అసలే ఆ దేశం తాలిబన్ల వశమైంది. గతంలో మాదిరి మిత్రదేశంగా విశ్వసించలేని పరిస్థితి.

Delhi : రోహిణి కోర్టు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు సీజే సీరియస్

దీంతో అధికారులు మరింత లోతుగా, నిశితంగా పరిశీలించారు. బస్తాల్లో రాళ్ల కింద పొడి రూపంలో పదార్థాన్ని గమనించారు. అది చూడ్డానికి టాల్కం పౌడర్ మాదిరి కనిపించడం లేదు. అంతే.. అనుమానం కలిగిందే తడవుగా ఆ పొడిని బయటికి తీసి, రసాయన పరీక్షలు నిర్వహించారు. అంతే.. అది ‘హెరాయిన్’ రకం నిషేధిత నార్కొటిక్ డ్రగ్ అని తేలిపోయింది. వెంటనే కంటైనర్లలో వచ్చిన సరుకునంతా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లెక్కిస్తే 2,988.21 కేజీలుగా తేలింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే మొత్తం విలువ రూ. 21,000 కోట్లకు పైగానే ఉంటుందని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తేల్చారు.

ముంద్రా పోర్టులో దొరికిన భారీ డ్రగ్స్ కంటైనర్లతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు, ఆ కన్‌సైన్మెంట్‌ను దిగుమతి చేసుకుంటున్న సంస్థను ఆషి ట్రేడింగ్ కంపెనీగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టర్డ్ కార్యాలయం కలిగిన ఆషి ట్రేడింగ్ కంపెనీ, చెన్నై నగరం నుంచి కార్యాకలాపాలు సాగిస్తోందని గుర్తించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు మూడ్రోజుల పాటు దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు నోయిడా(ఉత్తర్ ప్రదేశ్), చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, మాండ్వి, గాంధీధామ్, విజయవాడ నగరాల్లో డీఆర్ఐ అధికారులు దాడులు, సోదాలు నిర్వహించారు.

Amazon Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 4నుంచే

ఈ సోదాల్లో ఢిల్లీలోని ఓ గోడౌన్‌లో 16.1 కేజీల హెరాయిన్, నోయిడాలోని ఓ నివాస ప్రాంతంలో 10.2 కేజీల కొకైన్, 11 కేజీల హెరాయిన్ స్వాధీనం గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మొత్తమ్మీద నలుగురు అఫ్ఘాన్ జాతీయులు, ఒక ఉబ్జెక్ జాతీయుడు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన లైసెన్స్ కోడ్ ఉన్నట్టు గుర్తించారు.