Woman Killed In Rajasthan : రాజస్థాన్ లో దారుణం.. మేనత్తను హత్య చేసి 10 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన అల్లుడు

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.

Woman Killed In Rajasthan : రాజస్థాన్ లో దారుణం.. మేనత్తను హత్య చేసి 10 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన అల్లుడు

Woman Killed In Rajasthan

Woman Killed In Rajasthan : ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూజ్ శర్మ అలియాస్ గోవింద్ దాస్ (32).. వితంతువైన తన మేనత్త సరోజ్ శర్మ(65)తో కలిసి జైపూర్ లో నివసిస్తున్నాడు.

సరోజ్ శర్మ తన భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె బాగోగులను అనూజ్ శర్మ చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె తన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనూజ్ కు నచ్చలేదు. ఈ క్రమంలో ఈ నెల 11న అనూజ్ ఢిల్లీకి వెళ్లాల్సివచ్చింది. అయితే అందుకు సరోజ్ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన అనూజ్ ఆమెను సుత్తితో కొట్టి హత్య చేశారు.

Delhi murder: శ్రద్ధా హత్య తర్వాత మరో యువతితో అఫ్తాద్.. అప్పటికి ఫ్రిజ్‌లోనే శరీర భాగాలు.. విచారణలో సంచలన నిజాలు వెల్లడి

హార్డ్ వేర్ షాప్ నుంచి తీసుకొచ్చిన మార్బుల్ కటింగ్ మెషిన్ తో మృతదేహాన్ని పది ముక్కలుగా నరికాడు. తర్వాత ఆ ముక్కలను సూట్ కేసులో పెట్టుకుని ఢిల్లీ వెళ్లే జాతీయ రహదారి పక్కనున్న అడవిలోకి తీసుకెళ్లి వేర్వేరు చోట పడేశాడు. అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఏమీ తెలియనట్లు తన మేనత్త కనపించడం లేదంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాగా, సరోజ్ శర్మకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు విదేశాల్లో ఉంటున్నారు. అనూజ్ శర్మ కిచెన్ లో రక్తపు మరకలను శుభ్రం చేస్తూ సరోజ్ కుమార్తెకు దొరికిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనూజ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.