Supreme Court : ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయం
గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెంగింగ్ లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిపై తక్షణమే వాదనలు వినాలని అభ్యర్థించారు.
Supreme Court : ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తర్వాత ఈ కేసులపై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెంగింగ్ లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిపై తక్షణమే వాదనలు వినాలని అభ్యర్థించారు.
సంబంధిత పిటిషన్ పై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. విజయ్ హన్సారియా అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.