WHO: ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగం భారత్ లోనే.. కోవిడ్ పై డబ్య్లూహెచ్ఓ వారాంతపు నివేదిక

కోవిడ్ పై వారాంతపు నివేదికలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలు ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కరోనా విజృంభణకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు.

WHO: ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగం భారత్ లోనే.. కోవిడ్ పై డబ్య్లూహెచ్ఓ వారాంతపు నివేదిక

World Health Organization

WHO sensational things on covid : కోవిడ్ పై వారాంతపు నివేదికలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలు ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కరోనా విజృంభణకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్ లోనే ఉన్నట్లు వెల్లడించింది. ఇక అదే వారంలో ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రతి నాలుగు కోవిడ్ మరణాల్లో ఒకటి భారత్ లోనే ఉందని తెలిపింది.

ఆసియాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90 శాతం కేవలం భారత్ లోనే నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో ఇది 46 శాతం. ఇక ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం కోవిడ్ మరణాల్లో 25 శాతం భారత్ లోనే ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారాపు నివేదికలో ప్రకటించింది. ఇప్పటివరకు అత్యధిక కోవిడ్ మరణాలు అమెరికాలో చోటుచేసుకోగా బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.

భారత్ లో రోజువారి పాజిటివ్ కేసులు సంఖ్య దాదాపు నాలుగు లక్షలకు చేరడం, నిత్యం మూడున్నర వేల మంది కోవిడ్ తో మృత్యువాత పడుతున్నారని తెలిపింది. భారత్ లో కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటగా, మరణాల సంఖ్య 2లక్షల 26 వేలు దాటింది.