అంతర్జాతీయ కోర్టుకి నిర్భయ దోషులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీయాలని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను మార్చి5న జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది.
తమకు విధించిన మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ.. అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలు ఇవాళ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ను ఆశ్రయించారు. అయితే అంతకుముందు ఇవాళ ఉదయం మరణశిక్షను రద్దు చేయాలని ఇవాళ ముఖేశ్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్షమాభిక్ష పిటిషన్ ముగిసింది, ఇప్పుడు నీకు ఎటువంటి అవకాశం లేదని, క్యూరేటివ్ పిటిషన్ వర్తించదు అని సుప్రీంకోర్టు చెప్పింది. పిటిషన్ విచారణ అర్హత లేదని ముఖేశ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2012 Delhi gang rape case: Three convicts have approached the International Court of Justice (ICJ) seeking stay on the execution of their death sentence. The three convicts who approached the ICJ are Akshay, Pawan and Vinay. pic.twitter.com/i4kxdjTMcY
— ANI (@ANI) March 16, 2020
Also Read | కేఫే కాఫీ డే ఫౌండర్ ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు…2వేల కోట్లు మిస్సింగ్