గుజరాత్‌లో కూలిన భవనం : శిథిలాల్లో పలువురు

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 10:16 AM IST
గుజరాత్‌లో కూలిన భవనం : శిథిలాల్లో పలువురు

గుజరాత్ లోని  అహ్మదాబాద్‌ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.  ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించారు. మరింతమంది శిథిలాల్లో ఉన్నారనే అనుమానిస్తున్న గాలిస్తోంది.  శిథిలాల నుంచి వెలికి తీసినవారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

కాగా..ఆగస్టులో ఖేడాలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కాగా కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో వర్క్స్ జరుగుతున్న క్రమంలో  మంగళవారం కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో  మూడు భవనాలు కూలిపోయాయి.