Three Terrorists Kill Encounter : జమ్మూకశ్మీర్లో ఎన్ కౌంటర్..ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Three Terrorists Kill Encounter : జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నక్బాల్ ఏరియాలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారని బుధవారం (ఆగస్టు31,2022) మధ్యాహ్నం జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాగివున్న ఇంటిని కనిపెట్టి చుట్టుముట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.
jammu kashmir Encounter : జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం
మృతుల్లో డానిష్ భట్ అనే సీరియల్ కిల్లర్ కూడా ఉన్నాడు. ఈ ఎన్కౌంటర్ వివరాలను జమ్మూ అండ్ కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఎన్కౌంటర్లో భద్రతా బలగాల వైపు ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు.