అమెరికాలో మరో హైదరాబాద్‌ వాసిపై కాల్పులు

అమెరికాలో మరో హైదరాబాద్‌ వాసిపై కాల్పులు

Firing on Hyderabad resident in america : అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు జరిగాయి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురకు చెందిన 43 ఏళ్ల ముజీబుద్దిన్ పై దుండగులు కాల్పులు జరిపారు. బాధితున్ని చికాగో యూనివర్శిటీ ఆస్పత్రికి తరలించారు. విచెగేన్ కు సంబంధించిన ఎవెన్యూ చికాగోలో కారులో ప్రయాణిస్తుండగా నిన్న సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముజీబుద్ధిన్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముజీబుద్దిన్ కారులో ప్రయాణిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బాధిత కుటుంబం ఎక్స్ట్ ర్నల్ ఎఫైర్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాశారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే ఇండియన్ ఎంబిసీ వాషింగ్ టన్, ఇండియన్ కౌన్సిలేట్ కు సంబంధించిన చికాగో అధికారులను మంచి వైద్యం అందించాలని కోరారు. వీలైనంత త్వరలో ముజీబుద్దిన్ ను తమ కుటుంబానికి చేరవేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గడిచిన వారం రోజుల్లో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులపై అమెరికాలో విచక్షణారహితంగా కాల్పులు జరిగిన ఘటన వెలుగుచూసింది. ఇటీవలే హైదరాబాద్ చంచల్ గూడ ప్రాంతానికి చెందిన షీరాజ్ అనే యువకుడిపై అమెరికాలో కాల్పులు జరిపారు. ఈ ఘటనను నుంచి అతను సురక్షింతంగా బయటపడ్డాడు. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ యూకత్ పురాకు చెందిన మరో యువకుడు ముజీబుద్దిన్ పై కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది.