TMC : మమత కొత్త స్లోగన్.. కాంగ్రెస్ను పక్కకు పెట్టి ముందుకు రావాలి.. పార్టీలకు పిలుపు
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కొత్త స్లోగన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కాంగ్రెస్ ను పట్టుకుని...
Time To Merge With Us TMC Tell Congress : రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీల్లో కలవరం మొదలైంది. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో ఒక్కసారిగా పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొనేందుకు ప్రక్షాళన చేపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. మరోసారి కాంగ్రెస్ ను టీఎంసీ టార్గెట్ చేసింది. జాతీయంగా బీజేపీని దెబ్బతీయడంలో విఫలమైందని పేర్కొంది. కాంగ్రెస్ ను టీఎంసీలో విలీనం చేయాలని, బీజేపీని ఓడించగలిగే ఏకైక వ్యక్తి మమతా బెనర్జీ అంటూ పేర్కొంది. ఆమె నాయకత్వంలో చేతులు కలపాలని సూచించింది.
Read More : CM KCR Federal: సీఎంలు కేసీఆర్, స్టాలిన్తో మాట్లాడా, మేం కాపాడతాం: మమతా బెనర్జీ
ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కొత్త స్లోగన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కాంగ్రెస్ ను పట్టుకుని వేలాడడం అర్థం లేదని, ఆ పార్టీని పక్కకు పెట్టి.. ముందుకు రావాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు కాంగ్రెస్ ను కలుపుకుని పోవాలని బీజేపీయేతర పార్టీలు అనుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవంతో ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నాయి.
Read More : Navjot Singh Sidhu : పంజాబ్లో ఆప్ ప్రభంజనం.. ప్రజా తీర్పును శిరసావహిస్తా : నవజ్యోత్ సింగ్
బీజేపీ పార్టీపై పోరాడటానికి కాంగ్రెస్ శక్తి చాలదని తాము చాలాకాలంగా చెబుతున్నామని, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలంటే మమతా బెనర్జీ నాయకురాలు కావాలని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వెల్లడించారు. పాత పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకు కనుమరుగు అవుతుందో తెలియడం లేదని, టీఎంసీలో కాంగ్రెస్ ను విలీనం చేయడానికి ఇదే సరైన సమయమని టీఎంసీ నేత, రాష్ట్ర రవాణా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హకీమ్ తెలిపారు. జాతీయంగా మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలపై .. గాడ్సే సూత్రాలకు వ్యతిరేకంగా పోరాడవచ్చన్నారు.
Read More : Goa BJP : గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ!
గోవాలో టీఎంసీకి చేదు అనుభవమే మిగిలింది. ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. ఎన్నికల మిత్రపక్షమైన మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (MGP) రెండు సీట్లు గెలుచుకుని బీజేపీకి మద్దతివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పార్టీ నిర్ణయంపై టీఎంసీ షాక్ తిన్నది. తమకు వచ్చిన ఓట్ల శాతంతో సంతృప్తి చెందామని, కానీ MGP తీసుకున్న నిర్ణయంపై తాము వ్యాఖ్యానించలేమని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. మరి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
If Congress wants we all can fight (2024 general elections) together. Don’t be aggressive for now, be positive. This winning (Assembly polls in 4 states) will be a big loss for BJP. This (2022 election results will decide fate of 2024 polls) is impractical: WB CM Mamata Banerjee pic.twitter.com/vnqVGZBGLI
— ANI (@ANI) March 11, 2022