చెప్పిన పార్టీకి ఓటేయలేదని: భార్య గొంతులో యాసిడ్ పోసిన భర్త

  • Published By: vamsi ,Published On : April 27, 2019 / 01:06 PM IST
చెప్పిన పార్టీకి ఓటేయలేదని: భార్య గొంతులో యాసిడ్ పోసిన భర్త

తను చెప్పిన పార్టీకి ఓటు వేయలేదనే కోపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతులో యాసిడ్ పోసి తీవ్రంగా హింసించాడు. చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

అన్సురా బీ అనే మహిళ ఇటవల పశ్చిమబెంగాల్‌లో జరగిన ఎన్నికల్లో తన భర్త చెప్పిన పార్టీకి కాదని మరో పార్టీకి ఓటు వేసినట్లు వెల్లడించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అన్సురా బీ భర్త ఆమెను తీవ్రంగా గాయపరిచి గొంతులో యాసిడ్ పోసి చిత్రహింసలు పెట్టాడు.

ఇది గమనించిన స్థానికులు అన్సురా బీని వెంటనే ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలతో ఉన్న అన్సురా బీకి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. యాసిడ్ తాలూకు రసాయనాన్ని ఆమె శరీరం నుంచి తొలగించి చికిత్స అందిస్తున్నారు. కాగా నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.