రియల్ హీరోస్: రూల్స్ కంటే ప్రాణమే ఎక్కువ.. ఆంబులెన్స్‌ను తోసుకెళ్లారు

  • Published By: vamsi ,Published On : October 27, 2019 / 01:54 AM IST
రియల్ హీరోస్: రూల్స్ కంటే ప్రాణమే ఎక్కువ.. ఆంబులెన్స్‌ను తోసుకెళ్లారు

కొన్ని సార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పు మంచి కోసం చేస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించారు ఇద్దరు యువకులు. సరిగ్గా టైమ్‌కి ఆంబులెన్స్‌ను చేర్చేందుకు ఇద్దరు యువకులు చేసేందురకు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే..  ఢిల్లీలోని డీడీయూ ఆసుపత్రి నుండి ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి ఆంబులెన్స్‌లో ఓ రోగిని తీసుకుని వెళ్తున్నారు. అయితే ఆంబులెన్స్ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఆ రూటులోనే ప్రయాణించే ఇద్దరు బైకర్లు వారి రెండు బైక్‌లతో సమాంతరంగా తోసుకుంటూ వెళ్లారు.  దాదాపు 15 కిలోమీటర్ల దూరం వాళ్లు ఆ ఆంబులెన్స్‌ను తోసుకుంటూ వెళ్లారు.

ఈ క్రమంలో వారు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించారు. అయితే ప్రాణం కంటే రూల్స్ ఎక్కువ కాదు కదా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు వారు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. రియల్ హీరోస్ అని అంటున్నారు.