Covid-19 Vaccine : రోడ్డు పక్కన ట్రక్కు..తెరిచి చూస్తే.. 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకాలతో ఉన్న ట్రక్కు ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన నర్సింగ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Covid-19 Vaccine : రోడ్డు పక్కన ట్రక్కు..తెరిచి చూస్తే.. 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు

Truck

2 Lakh Doses Found : కరోనా టీకాలు లేదు..మహాప్రభో..పంపించండి..అంటున్నాయి పలు రాష్ట్రాలు. జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి కాకపోతుండడంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఆలస్యం జరుగుతోంది. పలు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. తాజాగా..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకాలతో ఉన్న ట్రక్కు ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన నర్సింగ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరేనీ ప్రాంతంలో బస్టాండుకు సమీపంలో ఓ ట్రక్కు చాలా సేపు ఆగి ఉంది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రక్కులో ఏముందోనని చూశారు. ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాదాపు 2,40,000 డోసుల కోవాగ్జిన్ టీకాలు కనిపించాయి. అక్కడ డ్రైవర్ ఎవరూ కనిపించలేదు.

హైవే సమీపంలో ఉన్న పొదల్లో కనిపించిన ఈ ట్రక్కులో ఎయిర్ కండీషన్ పనిచేస్తోందని, డోసులు బాగానే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వీటి విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More : Australians Banned: ఇండియా నుంచి తిరిగొస్తే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు