Gyanvapi Swasthika: మసీదు సర్వేలో బయటపడ్డ హిందూ పురాతన స్వస్తికలు: ఆందోళన నేపథ్యంలో సర్వే నిలిపివేత

వారణాసిలోని జ్ఞానవాపి -శృంగర్ గౌరి కాంప్లెక్స్లో ఉన్న జ్ఞానవాపి మసీదు సమీపంలో అధికారులు వీడియో కెమెరాతో సర్వే నిర్వహించారు. ఈసమయంలో మసీదు గోడలో కలిసి ఉన్న రెండు స్వస్తికల ఆనవాళ్లు కనిపించాయి

Gyanvapi Swasthika: మసీదు సర్వేలో బయటపడ్డ హిందూ పురాతన స్వస్తికలు: ఆందోళన నేపథ్యంలో సర్వే నిలిపివేత

Temple

Gyanvapi Swasthika: మసీదు వద్ద నిర్వహించిన ఓ సర్వేలో హిందూ పురాతన స్వస్తికలు బయటపడడం కలకలం రేగింది. ఈఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం చోటుచేసుకుంది. వారణాసిలోని జ్ఞానవాపి -శృంగర్ గౌరి కాంప్లెక్స్లో ఉన్న జ్ఞానవాపి మసీదు సమీపంలో అధికారులు వీడియో కెమెరాతో సర్వే నిర్వహించారు. ఈసమయంలో మసీదు గోడలో కలిసి ఉన్న రెండు స్వస్తికల ఆనవాళ్లు కనిపించాయి. సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని సర్వేని అడ్డుకున్నారు. హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన స్వస్తికలు మసీదులో బయటపడడంపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీంతో అధికారులు సర్వే నిలిపివేశారు. ఈసంధర్భంగా సర్వే బృందంలోని వీడియోగ్రాఫర్ ఒకరు వార్తా సంస్థ ఆజ్ తక్ తో మాట్లాడుతూ, సర్వే నిర్వహిస్తున్నప్పుడు మసీదు వెలుపల పురాతన స్వస్తికలను చూశామని చెప్పారు. స్వస్తికలు బహుశా పురాతన కాలంలో చెక్కి ఉంటారని పేర్కొన్నారు.

Also read:NFH Survey: భారత్‌లో 30%మంది మహిళలు శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు.. 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడట..

స్వస్తికల విషయంపై విచారణ జరిపేందుకు అధికారులు మసీదులోకి ప్రవేశిస్తుండగా అక్కడికి చేరుకున్న ముస్లిం మతపెద్దలు..వారిని అడ్డుకున్నారు. జ్ఞానవాపి మసీదు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వీడియోతో కూడిన సర్వే భూ సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఈ సర్వే చేపట్టారు. కోర్టు నియమించిన అధికారి మరియు న్యాయవాదుల బృందం శుక్రవారం ఈ ప్రాంతానికి సమీపంలో తనిఖీలు నిర్వహించిన తరువాత ఈ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను పూజించడానికి అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన రాఖీ సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు మరియు ఇతర మహిళలు కొందరు దాఖలు చేసిన పిటిషన్ పై వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఈ సర్వే జరుగుతోంది.

Also read:Crime News: యువతినంటూ మహిళలకే టోకరా వేసిన కేటుగాడు: 500 మంది నుంచి రూ.3.5 కోట్లు స్వాహా

అయితే సర్వేని నిలిపివేయాలంటూ ముస్లిం మత పెద్దలు..అక్కడకు వచ్చిన లాయర్లను, సర్వే అధికారులను అడ్డుకున్నారు. మసీదు సర్వే అడ్డగింతపై పిటిషన్ దారు రేఖ పాఠక్ స్పందిస్తూ..ఇక్కడ ‘శృంగార్ గౌరీ మాత’ కొలువైయున్న ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా మసీదు కారణంగా అమ్మవారి పూజలు నిలిచిపోయాయని..ఇప్పుడు అమ్మవారి ఆలయ సరిహద్దులు తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తుంటే ముస్లింలు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సర్వే నిలిపివేతపై సోమవారం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది.

Also read:Money Notes: సరస్సులో కట్టల కొద్ది రూ.2000 నోట్లు: ఆశ్చర్యపోయిన స్థానికులు