RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట

భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్లో సంఘ్ పరివార్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
ఇద్దరు పిల్లల నిబంధనపై చట్టం చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని, దీనిపై మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జనాభా పెరగడం దేశానికి ఇబ్బందికరంగా మారిపోతోందని, మతాలకతీతంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ట్రస్టు ఏర్పాటైతే..సంఘ్ పరివార్ పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్ట సవరణకు ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందని, దీనిపై దేశ వ్యాప్తంగా చట్ట అవసరాన్ని సంఘ్ కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు.
Read More : మోడీ, షా మధ్య విబేధాలున్నాయా – చత్తీస్ ఘడ్ సీఎం