కుక్క కోసం లొల్లి..ఫైరింగ్..ఇద్దరి మృతి

  • Published By: madhu ,Published On : July 30, 2020 / 09:55 AM IST
కుక్క కోసం లొల్లి..ఫైరింగ్..ఇద్దరి మృతి

అవును మీరు వింటున్నది నిజమే. కుక్క కొనుగోలు చేయడానికి వచ్చిన వారి మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిపోయింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజ్నోర్ లో ధంపూర్ పడ్లి పండు గ్రామంలో 2020, జులై 28వ తేదీన మంగళవారం కొంతమంది వ్యక్తులు కుక్కను కొనుగోలు చేయడానికి వచ్చారు. కానీ ఆ కుక్క తమకే కావాలని ఇరువర్గాలు పట్టుబట్టారు. మాటలో తిట్టుకున్నారు. పరిస్థితి కాస్తా ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఇరువర్గాలు గన్ లతో ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరుపుకున్నారు.

దారిలో వెళుతున్న ప్రశాంత్, కేహార్ సింగ్ లకు గాయాలు కావడంతో అక్కడికక్కడనే కుప్పకూలిపోయారు. సతేంద్రకు వెన్నెముకలో గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ, ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.