కడుపులో కాలిపోతోంది..ఒళ్ళంతా ముక్కలైపోయింది..నడవలేనమ్మా..అత్యాచారానికి గురైంది యువతి నరకయాతన

  • Published By: nagamani ,Published On : October 1, 2020 / 11:42 AM IST
కడుపులో కాలిపోతోంది..ఒళ్ళంతా ముక్కలైపోయింది..నడవలేనమ్మా..అత్యాచారానికి గురైంది యువతి నరకయాతన

Two men raped 20 year old rapes in bulandshhr up : అమ్మా…ఆకలేస్తోందని బిడ్డ అడిగితేనే తల్లి తల్లడిల్లిపోతుంది. ఒక్కక్షణం బిడ్డా..ఇదిగో ఇందా తినమ్మా..అంటూ తనకు లేకపోయినా కడుపులోది కూడా తీసి బిడ్డకు పెడుతుంది తల్లి. అటువంటిది కని పెంచి అల్లారుముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డ కనిపించకుండా పోయింది. ఆ తల్లి మనస్సు తల్లిడిల్లిపోయింది. వేయికళ్లతో బిడ్డ కోసం అంగాలార్చింది. ఈ కామాంధుల లోకంలో లేడిపిల్లలాంటి తన బిడ్డ ఏ మృగాళ్ల చేతచిక్కిందేమోనని అల్లాడిపోయింది.గుండెలు అరిచేతిలో పెట్టుకుని కళ్లల్లోఒత్తులు వేసుకుని వీధిలోనే బిడ్డకోసం నా బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలి భగవంతుడా అని మొక్కుకుంటూ ఎదురు చూస్తుంది. ఆ కూతురు వచ్చింది. కానీ.. పరిగెత్తుకుంటూ రావాల్సిన బిడ్డ అపస్మారకస్థితిలో చేతికి సెలైన్ బాటిల్ తో..ఒంటినిండా గాయాలతో నడవలేని స్థితిలో ఓ రిక్షాలో వచ్చిన బిడ్డను చూసిన ఆ కన్నతల్లి గుండె బద్దలైపోయింది.


బిడ్డా ఏంజరిగిందమ్మా అని గుండె చిక్కబట్టుకుని అడిగింది. అమ్మ అలా అడిగేసరికి ఆ బిడ్డ ఇక ఆగలేకపోయింది..అమ్మా అంటూ బావురుమంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.‘‘కామాంధుల బలైపోయానమ్మా..ఇద్దరు నరరూప రాక్షసులు..నామీద సాగించిన మారణకాండ గురించి చెప్పలేను..కాళ్లూ..నడుము విరిచేశాసారు..బాధతో గిలగిల్లాడుతున్న నాశరీరంతో ఇద్దరు మృగాళ్లు ఆడుకున్నారమ్మా..ఆ నరకానికి ఫలితంగా నా కడుపులో మంటలు పెట్టినట్లుగా కాలిపోతోందమ్మా..నేను నడవలేకపోతున్నా..ఈ బాధ భరించలేకపోతున్నానమ్మా..అంటూ బిడ్డ చెప్పిన ఆ నిప్పుకణికల్లాంటి మాటలకు ఆ తల్లి స్థాణువులా బిగిసిపోయింది.



దేనికైతే భయపడ్డానో..ఏం జరగకూడదని వేయి దేవుళ్లకు మొక్కుకున్నానో.. ఆ దారుణ మారణకాండ నా బిడ్డను నలిపేసిందని అర్థమైన ఆ తల్లి నిలువెల్లా కంపించిపోయింది. కన్నబిడ్డ తన కళ్లముందే చెప్పటానికి ఊహించలేని బాధతో..ఆవేదనతో ఆక్రోశంతో విలపించిపోతుంటే ఈ బతుకు ఎందుకురా దేవుడా..ఈ మృగాళ్ల లోకం నుంచి ఈ కామాంధుల లోకం నుంచి మమ్మల్ని తీసుకుపో..అంటూ భోరున ఏడుస్తూ బిడ్డను తీసుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఇది కథకాదు..వాస్తవం..నేరాలకు అడ్డాగా..ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణ మారణకాండకు నిలువెత్తు నిదర్శనంగా యూపీలోని బల్ రామ్ పూర్ కు చెందిన 22 ఏళ్లయువతికి జరిగిన హింస.


బల్‌రామ్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల యువ‌తి కాలేజీ అడ్మిష‌న్ కోసం ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌ల్దేరింది. సాయంత్రం ఇంటికి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఆ యువ‌తిని ఇద్ద‌రు యువ‌కులు అడ్డ‌గించారు. బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. మ‌త్తు మందు ఇచ్చి దారుణంగా అత్యాచారం చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్‌ బాటిల్‌తో ఈ-రిక్షాలో ఇంటికి చేరింది. తనకు కడుపులో ఏదో కాలిపోతున్నట్లు ఉందని, నడవలేనని తల్లికి చెప్పింది. ఈ బాధ భరించలేకపోతున్నానమ్మా…అంటూ తల్లిని చుట్టేసుకుని భోరున ఏడ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.


ఆమె ప‌రిస్థితి తీవ్రవిషమిమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ల‌క్నోకు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే యువ‌తి కన్నవారికి కడుపుశోకం మిగిల్చి చనిపోయింది. ఆమెకు మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి అయింది. మృగాళ్లు ఆమె నడుమును విరచడంతో పాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు తెలిపారు.


అదే విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి..తమ బిడ్డను నరకయాతనకు గురిచేసి ఆమె చావుకు కారణమైన కామాంధులను కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బలరాంపూర్ ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు.


అత్యాచారానికి ముందు తమ కూతురికి మత్తు ఇంజెక్షన్‌కు ఇచ్చి మరీ ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు తల్లి కన్నీటి పర్యంతమైంది. రెండు కాళ్లను విరిచేసి, శవంలాంటి తన బిడ్డను పంపారని వాపోయింది. ఐతే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చారు. పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయాలేవీ తేలలేదని బలరాంపూర్ పోలీసులు గత రాత్రి ట్వీట్ చేయటం గమనించాల్సిన విషయం.