Terrorists : శ్రీనగర్ లో ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ రాజధాని ​శ్రీనగర్ పట్టణ శివార్లలోని ఖన్​మోహ్​ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో

Terrorists : శ్రీనగర్ లో ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

Terrorists

Srinagar జమ్ముకశ్మీర్ రాజధాని ​శ్రీనగర్ పట్టణ శివార్లలోని ఖన్​మోహ్​ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఖన్​మోహ్​ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో భద్రతాదళాలతో కలిసి సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు. ఈ క్రమంలో తీవ్రవాదులు పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఉగ్రవాదుల కాల్పులను ధీటుగా తిప్పిగొట్టారు. దాదాపు 5గంటలపాటు ఎన్ కౌంటర్ కొనసాగింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని..వాళ్లు అల్ బదర్ ఉగ్రసంస్థకు చెందినవాళ్లని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులేనని తెలిపారు.

ఎన్ కౌంటర్ ప్రారంభానికి ముందు వారికి లొంగిపోయేందుకు అవకాశమిచ్చామని..అయితే ఆ ఆఫర్ ను వాళ్లు తిరస్కరించారని..దీంతో ఆపరేషన్ చేపట్టాల్సివచ్చిందని విజయ్ కుమార్ తెలిపారు. శ్రీనగర్ లో ప్రస్తుతం ఐదుగురు స్థానిక టెర్రరిస్టులు యాక్టివ్ గా పనిచేస్తున్నారని..వాళ్లని పట్టుకోవడం లేదా చంపేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీనగర్ లో విదేశీ టెర్రరిస్టులు లేరని సృష్టం చేశారు.