Lalu’s daughter: ‘కూతురంటే రోహిణి ఆచార్యలా ఉండాలి’: లాలూ కూతురిపై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తండ్రి లాలూకి రోహిణి కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు బీజేపీ నేతల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా రోహిణిని కొనియాడారు. భవిష్యత్తు తరాలకు ఆమె ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.

Lalu’s daughter: ‘కూతురంటే రోహిణి ఆచార్యలా ఉండాలి’: లాలూ కూతురిపై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు

Lalu’s daughter: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తండ్రి లాలూకి రోహిణి కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు బీజేపీ నేతల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా రోహిణిని కొనియాడారు.

‘‘కూతురంటే రోహిణి ఆచార్యలా ఉండాలి’’ అని హిందీలో గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఆమె ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోను కూడా గిరిరాజ్ పోస్ట్ చేయడం గమనార్హం. గిరిరాజ్ కూడా బిహార్ కు చెందిన నేత. ఆర్జేడీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. అయినప్పటికీ, ఆయన లాలూ కుమార్తెను ప్రశంసించడం గమనార్హం.

కాగా, పశు దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి, జైలు శిక్ష ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ వచ్చింది. అలాగే, ఆయన విదేశాలకు కూడా వెళ్లేందుకు అనుమతి దక్కింది. ఆయన కిడ్నీ పాడవడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు చిన్నకూతురు రోహిణి ముందుకు వచ్చింది.

తాజాగా, లాలూ పెద్ద కూతురు మీసా భారతి ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో లాలూ ఉన్నారు. ‘‘నా కోసం మీరందరూ ప్రార్థించారు. ప్రస్తుతం నాకు బాగానే ఉంది’’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అందులో చెప్పారు.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్