CM Yogi Corona : కరోనా కల్లోలం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్
కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. సామాన్యులను కాదు ప్రముఖులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది.
CM Yogi Adityanath Corona : కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. సామాన్యులను కాదు ప్రముఖులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది.
సీఎం కార్యాలయంలో పని చేస్తున్న అధికారుల్లో కొందరికి పాజిటివ్ గా తేలడంతో సీఎం యోగి ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ కి వెళ్లారు. తాజాగా ఆయనకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ గా వచ్చింది. దీంతో డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్ష చేయించుకున్నా. కరోనా పాజిటివ్ గా తేలింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నా. నా పనులన్నీ వర్చువల్ గా నిర్వహిస్తున్నా’ అని యోగి ట్వీట్ చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్కు కూడా కరోనా సోకినట్లు ఇవాళే(ఏప్రిల్ 14,2021) తన ట్విట్టర్లో తెలిపారు.