UP Election : యూపీలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన మాజీ సీఎం మనువళ్లు
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు జంప్ కాగా
UP Election వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు జంప్ కాగా, తాజాగా మరో ఇద్దరు కీలకమైన సీనియర్ నేతలు రాజేశ్పతి త్రిపాఠి మరియు ఆయన కుమారుడు లలితేశ్పతి త్రిపాఠి హస్తానికి హ్యాండిచ్చి టీఎంసీలో చేరారు.
సోమవారం వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో సీఎం మమతా బెనర్జీ,టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో తండ్రీ కొడుకులిద్దరూ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో కేంద్రంలో మరియు యూపీలో బీజేపీని గద్దె దించేందుకు పోరాడతామని టీఎంసీలో చేరిన అనంతరం తండ్రీ కొడుకులు తెలిపారు.
కాగా, యూపీ మాజీ ముఖ్యమంత్రి మనువడే కమలాపతి త్రిపాఠి. కమలా త్రిపాఠి మాజీ ఎమ్మెల్సీ. కమలా త్రిపాఠీ కుమారుడు లలితేశ్పతి త్రిపాఠి..మాజీ ఎమ్మెల్యేగా మరియు యూపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేశారు.
కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. ఇద్దరు కాంగ్రెస్ నేతల చేరికతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగల అఖిల భారత పార్టీగా నిరూపితమవుతోందని పేర్కొన్నారు.
ALSO READ Reunited By Facebook : 58 ఏళ్ల తర్వాత..తండ్రీ కూతుళ్లను కలిపిన ఫేస్ బుక్