Uttar Pradesh : కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్‌గా తిన్న మందుబాబులు

కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్‌గా తిన్నారు మందుబాబులు.

Uttar Pradesh : కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్‌గా తిన్న మందుబాబులు

drunking mans chops tail and ears of puppies eats

Uttar Pradesh drunking mans chops tail and ears of puppies eats : మద్యం తాగేవారు పక్కన ఏదోకటి పెట్టుకుని తింటుంటారు. ఆమ్లెట్‌, చిప్స్‌, చికెన్‌ ఇవేవీ లేకపోతే ఏదోక స్సైసీ ఐటెమ్ పెట్టుకుని మద్యం తాగుతుంటారు. కానీ కొంతమంది మందుబాబులు చేసింది వింటే వీళ్లసలు మనుషులేనా? మనిషి రూపంలో ఉన్న రాక్షసులా అనుకునే ఘాతుకానికి తెగబడ్డారు మద్యంలో నంజుకోవడానికి ఏమీ లేదని పక్కనే కనిపించిన ఓ రెండు కుక్కపిల్ల చెవులు, తోక కోసి వాటినికి ఉప్పూ,కారం రాసి తినేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనతో వీళ్లు నరరూప రాక్షసులు అని అనుకోవాల్సిందే..

బరేలీ జిల్లా ఫరీద్‌పూర్‌ ప్రాంతంలోని ఎస్‌డీఎం కాలనీకి చెందిన ముఖేష్‌ వాల్మీకితో పాటు మరో వ్యక్తి ఇద్దరు కలిసి ఫుల్ గా మద్యం తాగారు. మందు భలేగుందిగానీ నంచుకోవటానికి ఏమీ లేదురా?.ఏదన్నా స్పైసీగా ఉంటే బాగుండురా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ చుట్టుపక్కల తిరుగుతున్న రెండు కుక్కపిల్లలను పట్టుకున్నారు.

Three Mens Hang Dog To Death : వీళ్లసలు మనుషులేనా?..అత్యంత దారుణంగా కుక్కకు ఉరి వేసి చంపిన వ్యక్తులు

ఒక కుక్క రెండు చెవులు, మరో కుక్క తోకని కట్‌ చేశారు. ఆ తరువాత వాటికి ఉప్పు, కారం రాసుకుని లాగించేశారు. ఈ విషయం చూసిన ఓ వ్యక్తి పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యుడుగా పనిచేస్తున్న ధీరజ్ పతాక్ కు తెలపటంతో ధీరజ్‌ సదరు వ్యక్తులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఘటనాస్థలానికి వెళ్లి గాయపడిన కుక్కపిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మందుబాబుల చేసిన పనికి తీవ్రంగా గాయపడిన కుక్కపిల్లలు చికిత్స పొందుతున్నాయని స్థానిక సీనియర్‌ పోలీసు అధికారి అఖిలేష్‌ చౌరాసియా తెలిపారు.