గంగానదిలో శవాలు..యోగి సర్కార్ పై అఖిలేష్ విమర్శలు

గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

గంగానదిలో శవాలు..యోగి సర్కార్ పై అఖిలేష్ విమర్శలు

Up Government

UP Government గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అవి ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చిన శవాలేనని బీహార్ అధికారులు స్పష్టం చేయడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అంత్యక్రియలు నిర్వహించకుండా శవాలను గంగా నదిలో వదిలేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది యూపీ ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సీరియస్ కామెంట్స్ చేశారు. గంగలో తేలుతున్న శవాలు కేవలం లెక్కలు కాదని.. అవి ఎవరో ఒకరి తండ్రి, తల్లి, సోదరుడు, సోదరివని ఆయన అన్నారు. నారాహి ఏరియాలోని ఉజియార్, కుల్దియా, భరౌలీ సమీపంలో సుమారు 52 శవాలు నదిలో తేలుతూ కనిపించాయని స్థానికులు చెబుతున్నారని.. కానీ జిల్లా అధికారులు మాత్రం నిజాలు చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. గంగా నదిలో తేలిన శవాలకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం ఘోరం విఫలమైందని.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో వైఫల్యం చెందిందని అఖిలేష్ మండిపడ్డారు.

మరోవైపు బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజిన్(BAPIO) సేవలను అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. ఇండియాలో కరోనా తీవ్రత నేపథ్యంలో భారత సంతతి డాక్టర్ల అసోసియేషన్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు పంపడంపై హర్హం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కలసి పనిచేసేందుకు ముందుకొచ్చిన డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.