పెళ్లిలో ఇంకా మద్యం ఇవ్వలేదని వరుడిని చంపేసిన ఫ్రెండ్స్

పెళ్లిలో ఇంకా మద్యం ఇవ్వలేదని వరుడిని చంపేసిన ఫ్రెండ్స్

No Liquor, no Shaadi :  ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లిలో తాగిన మందు సరిపోలేదు..ఇంకా లిక్కర్ ఇవ్వాలన్న ఫ్రెండ్స్ కోరికకు నో చెప్పడమే ఆ వరుడి పాలిట శాపమైంది. పీకలదాక తాగి..మత్తులో ఉన్న ఆ స్నేహితులు..పెళ్లి కొడుకునే చంపేశారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాదం నింపింది. పాలిముకిమ్ పుర్ గ్రామంలో బబ్లు (28) వివాహం జరుగుతోంది. కుటుంబీకులు, ఫ్రెండ్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఫ్రెండ్స్‌ మందు తాగుతూ..ఎంజాయ్ చేస్తున్నారు. వీరిని పలుకరించేందుకు బబ్లు వెళ్లాడు. మత్తులో ఉన్న ఫ్రెండ్స్..తమకు మందు సరిపోలేదని..ఇంకా తెప్పించాలని డిమాండ్స్ చేశారు. తాను తెప్పించలేనని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొంతమంది కత్తితో బబ్లును పొడిచారు. రక్తం మడుగులో కుప్పకూలిపోయిన బబ్లును ఆసుపత్రికి తరలించారు. కానీ..మార్గమధ్యంలోనే చనిపోయాడు. దీంతో బబ్లు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటిదాక ఎంతో కళకళలాడిన పెళ్లి పందిరి వద్ద రోదనలు మిన్నంటాయి. ప్రధాన నిందితుడు రామ్ ఖిలాడీని పోలీసులు అరెస్టు చేయగా..కేసుతో లింకున్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.