Triple talaq : కట్నంతో పాటు కారు ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి తలాక్ చెప్పిన భర్త

కట్నంతో పాటు కారు ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి తలాక్ చెప్పాడో భర్త.

Triple talaq : కట్నంతో పాటు కారు ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి తలాక్ చెప్పిన భర్త

UP man gives triple talaq for not getting car as dowry

Triple talaq : ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టం వచ్చినా ‘తలాక్ అని మూడుసార్లు చెప్పి భార్యలను వదిలించుకునే జాడ్యం పోవటంలేదు. కట్నంగా డబ్బుల నగలు దోచిపెట్టలేదనో..అధిక కట్నం తేలేదనో..మగపిల్లాడు పుట్టలేదనో..రెండో పెళ్లి చేసుకోవాలనే దురాశతోనే భార్యలను వదిలించుకోటం తలాక్ అనే మూడుమార్లు పలికే మాటతో పరిపాటిగా మారిపోయింది. ఈక్రమంలో అటువంటిజరిగింది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో. లక్షల రూపాయల కట్నం తీసుకున్నా అతగాడికి కారు ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ అని చెప్పేసి ఇక నీకూ నాకూ ఎటువంటి సంబంధంలేదని తేల్చిపారేశాడు ఓ భర్త.

దీంతో ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.ఘజియాబాద్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లోని కైలా బట్టీ ప్రాంతంలో కట్నంతో పాటు కారు ఇవ్వలేదని తన భర్తతో పాటు అత్తమామలు కూడా వేధించారని తన భర్త తనకు తలాక్ చెప్పి నీకు నాకు ఇక ఎటువంటి సంబంధంలేదు పొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. తన భర్తతో సహా ఐదుగురిపై ఫిర్యాదు చేసింది.

కైలా భట్టా నివసిస్తున్న రుబీనాకు నివారీకి చెందిన ఇమ్రాన్ సైఫీతో డిసెంబర్ 2017లో వివాహం జరిగింది. వీరికి 4 సంవత్సరాల పాప ఉంది. పెళ్లయినప్పటి నుంచి కట్నం కోసం వేధిస్తున్నాడని..శారీరకంగా, మానసికంగా అత్తమామలు వేధించారని సదరు యువతి వాపోయింది. కట్నం వేధింపులను భరించలేని రుబీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తమామలు దిగి వచ్చారు. రుబీనాతో రాజీ కుదుర్చుకున్నారు. కొంతకాలానికి భర్త ఇమ్రాన్ సైఫ్ రాజస్థాన్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి రుబీనాను మీ అమ్మాగారి ఇంటికి వెళ్లు నేను కొన్ని రోజుల తరువాత వచ్చి తీసుకెళతానని చెప్పారు. అది నమ్మింది రుబీనా.

దీంతో ఇమ్రాన్ రుమీని అత్తవారింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తనకు భర్త ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పాడని ఇక నువ్వు నాకు భార్యవు కాదు అని చెప్పాడని రుబీనా తెలిపింది.ట్రిపుల్ తలాక్ చెప్పి కాల్ డిస్‌కనెక్ట్ చేశాడని రుబీనా తెలిపింది.తనను తన పుట్టింటిలో వదలిని సమయంలో తన అత్తమామలు తన నగలు, ఇతర వస్తువులనుకూడా పట్టుకుపోయారని తెలిపింది.రుబీనా ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నగర్ కొత్వాలి ఇన్‌ఛార్జ్ అమిత్ కుమార్ ఖరీ తెలిపారు. త్వరలో మహిళ అత్తమామలను అరెస్టు చేయనున్నామని తెలిపారు.