నడుస్తున్న బస్సులో అత్యాచారం.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

  • Published By: vamsi ,Published On : August 30, 2020 / 08:47 AM IST
నడుస్తున్న బస్సులో అత్యాచారం.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. బాధిత మహిళ హెల్ప్‌లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బస్సును ఆపి నిందితుడు బస్ క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఢిల్లీలోని తన ఇంటికి తరలించారు.

ఈ సంఘటన యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగినట్లు తెలుస్తుంది. తాను ప్రైవేట్ బస్సులో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా తన ఇంటికి తిరిగి వస్తుండగా.. బస్సు సిబ్బంది తనను బలవంతం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. లక్నో నుంచి బస్సు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది మధురలోని మాంట్ టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు, ఆ మహిళ హెల్ప్‌లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వెంటనే పోలీసులు వెళుతున్న బస్సును చేజ్ చేసి ఆపి పట్టుకున్నారు. మహిళను మరియు నిందితులను బస్సులోంచి దించి మొత్తం బస్సును తనిఖీ చేశారు. బహ్రాయిచ్ జిల్లా నివాసి అయిన నిందితుడు రవిని కస్టడీలోకి తీసుకున్నారు.