కాంగ్రెస్ కామన్ సెస్స్ ఉపయోగించాలి

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 12:27 PM IST
కాంగ్రెస్ కామన్ సెస్స్ ఉపయోగించాలి

కాంగ్రెస్ పార్టీ కామన్ సెస్స్ ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల దేశ ప్రజలు ఫీల్ అయ్యారని, మన దగ్గర రాఫెల్ కనుక ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని,రాఫెల్ మన దగ్గర లేకపోవడానికి కాంగ్రెస్ నాయకుల స్వార్థప్రయోజనాలే కారణమని ప్రధాని మోడీ ఆదివారం అన్న విషయం తెలిసిందే. 

 సోమవారం(మార్చి-4,2019) గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోడీ..రాఫెల్ పై తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, దయచేసి ప్రతిపక్షం కామన్ సెన్స్ ఉపయోగించాలని అన్నారు. వైమానిక దాడుల సమయంలో మన దగ్గర రాఫెల్ ఉన్నట్లయితే మన యుద్ధ విమానాలు కిందకు వెళ్లేవి కావని, పాకిస్తానీలు ఎవ్వరూ రక్షించడబేవాళ్లు కాదని మోడీ అన్నారు. ఖచ్చితమైన సమయంలో కనుక మన దగ్గర రాఫెల్ ఉండి ఉంటే పరిస్థితి వేరాలా ఉండేదని తాను అంటే కాంగ్రెస్  నేతలు మాత్రం మోడీ మన వైమానిక దాడులను ప్రశ్నిస్తున్నారని అంటున్నారని మోడీ తెలిపారు.