UP : కుప్పకూలిన గోడ..ముగ్గురు చిన్నారులు మృతి

UP : కుప్పకూలిన గోడ..ముగ్గురు చిన్నారులు మృతి

Three Children Died After A Wall Collapsed

three children died after a wall collapsed : ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఆగ్రా జిల్లాలో కగరోల్ గ్రామంలో గోడ కుప్పకూలిపోవటంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బాలికలు..ఓ బాలుడు ఉన్నారు. ఈ ఘటనలలో పలువురు గాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.అలాగే శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషిచేశారు.

కాగా..గోడకూలిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి శిథిలాల్లో చిక్కుకున్న వారందరినీ రక్షించి..ఆసుపత్రికి తరలించారు. గోడకూలిన ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారని..ముగ్గురు చిన్నారులు చనిపోయారని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కగరోల్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గోడకూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల్లో చిక్కుకున్న వారందరినీ రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారని, మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు.