Uttar Pradesh : పామును కొరికి చంపేసిన మూడేళ్ల పిల్లాడు..

ఓ మూడేళ్ల పిల్లాడు పాముని పట్టుకుని కొరికి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పాము చనిపోయింది. కానీ పిల్లాడు మాత్రం..

Uttar Pradesh : పామును కొరికి చంపేసిన మూడేళ్ల పిల్లాడు..

up boy chews snake

three year boy chews snake : మూడేళ్ల పిల్లాడు పాముని కొరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లా కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మాద్నాపూర్ గ్రామంలో ఇంటిబయట ఆడుకుంటున్న పిల్లాడు తన వద్దకు వచ్చిన పాముని అమాంతంగా పట్టుకుని కొరికేశారు. దాంతో ఆపాము అక్కడిక్కడే చచ్చిపోయింది. పాము చనిపోయింది. ఆ కాసేపటికే పిల్లాడు స్పృహ తప్పి పడిపోయాడు.

మాద్నాపూర్ గ్రామంలో దినేశ్ సింగ్ అనే వ్యక్తం తన మూడేళ్ల కొడుకు, తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో గత శనివారం పిల్లాడు ఇంటి బయటకు ఆడుకుంటుండగా అక్కడికి ఓ పాము వచ్చింది. భయం అంటే ఏంటో..పాము కరుస్తుందని తెలియని ఆ పసిపిల్లాడు పాకుతున్న ఆ పాముని అమాంతంగా పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికేశాడు. పాము చనిపోయింది. పిల్లాడు స్పృహ తప్పి పడిపోయాడు.

 

అప్పటి వరకు పనిలో ఉన్న బాలుడి నాయనమ్మ పిల్లాడు ఏం చేస్తున్నాడో చూడటానికి వచ్చింది. అంతే పిల్లాడి నోటికి రక్తం..పక్కనే పడి ఉన్న పాముని చూసి హడలిపోయింది. వెంటనే పెద్ద పెద్ద కేకలు వేసింది. వెంటనే స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లకు విషయం చెప్పింది. దీంతో డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు.24 గంటలు చికిత్స తరువాత ఎటువంటి ప్రమాదం లేదని చెప్పటంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.