ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడు, బిడ్డకు ఆయనే తండ్రి. బ్లాక్ మెయిల్ చేస్తోందంటున్న ఎమ్మెల్యే భార్య

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 12:45 PM IST
ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడు, బిడ్డకు ఆయనే తండ్రి. బ్లాక్ మెయిల్ చేస్తోందంటున్న ఎమ్మెల్యే భార్య

ఉత్తరాఖండ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన బిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఓ మహిళ ఆరోపణలు గుప్పిస్తోంది. వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరుతోంది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే భార్య కొట్టిపారేస్తోంది. బ్లాక్ మెయిల్ చేస్తోందని వెల్లడించింది. ఇరువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Dwarahat ఎమ్మెల్యే మహేష్ నేగీ మహిళ ఆరోపణలు చేస్తోందని DG (law and order) అశోక్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీ, ముస్సోరి, హిమాచల్ ప్రదేశ్, నేపాల్ ప్రాంతాలకు తీసుకెళ్లి (2016 నుంచి 2018) అత్యాచారం చేశాడని మహిళ ఆరోపిస్తోందన్నారు. తల్లి అనారోగ్యానికి సంబంధించిన విషయంలో 2016లో ఎమ్మెల్యేను కలిసినట్లు, ఈ విషయం తెలుసుకున్న తర్వాత..ఎమ్మెల్యే భార్య తనకు రూ. 25 లక్షలు ఇచ్చి విషయం బయటకు చెప్పవద్దని డిమాండ్ చేసిందని వెల్లడించింది.



దీంతో…ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే భార్య వెల్లడిస్తూ..నెహ్రూ కాలనీ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరుగుతోందన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలున్నాయని, డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ డిమాండ్ చేశారు.