పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2019 / 03:18 PM IST
పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసని జైషే మహమ్మద్‌ కమాండర్‌ నిసర్‌ అహ్మద్‌ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం ఆదివారం నిసర్‌ ను దుబాయ్‌ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్‌ అనేక కీలక అంశాలను బయటికి చెప్పాడు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగినట్లు నిసర్ తెలిపాడు.

ఈ దాడికి ప్రధాన కుట్రదారుడు ముదాసిర్‌ ఖాన్‌ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్‌ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని తెలిపాడు. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్‌ తనకు చెప్పాడని నిసర్‌ తెలిపాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్‌ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి. ఇప్పటివరకు భారతీయ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ మీద ఆధారపడ్డాయి.