Water Taxi Services : మహారాష్ట్ర సముద్ర తీరంలో కొత్తగా ‘వాటర్ ట్యాక్సీ’ సర్వీసు
మహారాష్ట్ర సముద్ర తీరంలో కొత్తగా ‘వాటర్ ట్యాక్సీ’ సర్వీసు ప్రారంభమైంది. ముంబైలో మజ్గావ్లోని డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్(డీసీటీ) నుంచి రాయగఢ్ జిల్లా అలీభాగ్ సమీపంలోని మండ్వా జెట్టి వరకు మంగళవారం ‘నయన్-11’ అనే వాటర్ ట్యాక్సీ తొలిసారిగా ట్రిప్పులు వేసింది.
water taxi services : మహారాష్ట్ర సముద్ర తీరంలో కొత్తగా ‘వాటర్ ట్యాక్సీ’ సర్వీసు ప్రారంభమైంది. ముంబైలో మజ్గావ్లోని డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్(డీసీటీ) నుంచి రాయగఢ్ జిల్లా అలీభాగ్ సమీపంలోని మండ్వా జెట్టి వరకు మంగళవారం ‘నయన్-11’ అనే వాటర్ ట్యాక్సీ తొలిసారిగా ట్రిప్పులు వేసింది. ఈ సర్వీసును నయనతార షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించింది.
Visakha Beach Black Color Sand : విశాఖ సాగర తీరంలో ఏం జరుగుతోంది? బీచ్ ఇస్తున్న వార్నింగ్ ఏంటీ..?
నయన్-11 ట్యాక్సీలో మొత్తంగా 200 మంది వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ సర్వీసు ద్వారా ప్రయాణికులు డీసీటీ నుంచి మండ్వాకు 35-40 నిమిషాల్లో చేరుకోవచ్చు. వన్వే ప్రయాణానికి 400-450 చార్జీ వసూలు చేస్తారు. రోజుకు రానుపోను ఆరు ట్రిప్పులు ఉంటాయని కంపెనీ తెలిపింది.