ప్రాణాలు తీసిన అనుమానం: గోవులను దొంగిలిస్తున్నారని కొట్టి చంపేశారు

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 06:16 AM IST
ప్రాణాలు తీసిన అనుమానం: గోవులను దొంగిలిస్తున్నారని కొట్టి చంపేశారు

పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో దారుణం చోటుచేసుకుంది. కూచ్ బెహర్ లోని పుతిమారి పేలేశ్వరి గ్రామంలో  గోవులను దొంగిలిస్తున్నారనే అనుమాతనం ఇద్దరు వ్యక్తులపై కొంతమంది మూకదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.  

గోవులను దొంగిలించి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో బాబ్లూ మిలన్, ప్రకాశ్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులపై స్థానికులు దాడి చేసి కొట్టి చంపేశారు. బాబ్లూ మిలన్, ప్రకాశ్ దాస్ లు కొన్ని ఆవులను ట్రక్ లో తీసుకెళుతున్నారు. ఇది చూసిన స్థానికులు వారిని ఆపి ప్రశ్నించారు. దానికి వారు సమాధానం చెప్పినా ఆగ్రహంతో ఉన్న స్థానికులు వినిపించుకోలేదు.

స్థానికుల దాడిలో బాబ్లూ మిలన్, ప్రకాశ్ దాస్ లకు తీవ్రంగా గాయాలయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న కొత్వాలి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరినీ సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించటంతో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.