అమిత్ షాకు స్పెషల్ కోర్టు సమన్లు

అమిత్ షాకు స్పెషల్ కోర్టు సమన్లు

Special court కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్​ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. 2018 ఆగస్టు 28న తృణమూల్‌ కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్‌ ద్వారా హాజరుకావాలని అమిత్ షాను కోర్టు ఆదేశించింది.

కాగా, 2018 ఆగస్టు 11న కోల్​కతాలో బీజేపీ నిర్వహించిన యువ స్వాభిమాన్ సభలో అమిత్ షా… అభిషేక్ బెనర్జీపై పలు ఆరోపణలు గుప్పించారు. నారద, శారద, రోజ్ వ్యాలీ, సిండికేట్ అవినీతి, మేనల్లుడి అవినీతి, మమత బెనర్జీ వరుసగా అవినీతికి పాల్పడుతున్నారని అమిత్ షా అన్నారు.

బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాలవాసులారా, మీ గ్రామానికి డబ్బులొచ్చాయా? గట్టిగా చెప్పండి. డబ్బులు మీ గ్రామానికి వచ్చాయా? ఎక్కడికెళ్ళాయి? ఎక్కడికి? మోడీ ఆ డబ్బులు పంపించారు. రూ.3,59,000 కోట్లు ఎక్కడికెళ్ళాయి? ఆ సొమ్ముని మేనల్లుడికి, సిండికేట్‌కి బహుమతిగా ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి బలిపీఠం దగ్గర ఈ సొమ్మును బలి ఇచ్చారు అని అమిత్ షా చెప్పినట్లు అభిషేక్ బెనర్జీ పిటిషన్‌లో ఆరోపించారు.