PM Modi : బలమైన భారత్ నిర్మాణానికి కృషి చేస్తాం

కేంద్ర కేబినెట్ విస్తరణ లో భాగంగా ఇవాళ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi : బలమైన భారత్ నిర్మాణానికి కృషి చేస్తాం

Cabinet

PM Modi కేంద్ర కేబినెట్ విస్తరణ లో భాగంగా ఇవాళ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సహోద్యోగులందరినీ నేను అభినందిస్తున్నాను మరియు వారి మంత్రి పదవీకాలానికి వారికి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మరియు బలమైన మరియు సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి మేము కృషి చేస్తాము అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. మొత్తం 43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. నిన్నటి వరకు సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్‌ రిజిజు, మన్‌సుఖ్‌ మాండవియా, హరిదీప్‌సింగ్‌ పురీ, రామచంద్ర ప్రసాద్​ సింగ్‌.. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.