MP Warning: మా నాయకుడి జోలికొస్తే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తా : ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు.
MP Warning: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్నదాతలు నిరసనలు చేస్తుండగా.. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, మాజీ మంత్రి మనీష్ గ్రోవర్కు హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో నిరసనల సెగ తగిలింది. రైతులకు క్షమాపణలు చెప్పాలంటూ.. ఓ ఆలయంలో బయటికి రానివ్వకుండా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న రైతులు బంధించారు.
అయితే, ఎనిమిది గంటల సమయం తర్వాత శాంతించిన రైతులు ఆయనకు దారివ్వగా.. బయటకు రాగలిగారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు మాత్రం కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ స్థానిక ఎంపీ అరవింద్ శర్మ సంబంధిత వ్యక్తులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీష్ గ్రోవర్ను నిర్భందించినవారి కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ఓ బహిరంగ కార్యక్రమంలో ఈమేరకు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాంచందర్ జాంగ్రా సైతం ‘నిరసనకారులంతా పనీబాట లేని తాగుబోతులంటూ’ వ్యాఖ్యలు చేయడం వివాదం అయ్యింది.
#WATCH | Congress&Deepender Hooda should listen
that if anyone dares to look towards Manish Grover (BJP leader) then we’ll take their eyes out. If they put hands on him then their hands will be chopped off: BJP MP Dr Arvind Sharma in Haryana’s Rohtak on yday’s incident at Kiloi pic.twitter.com/RhhZuq0PGL— ANI (@ANI) November 6, 2021