Sitaram Yechury : 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తాం – సీతారాం ఏచూరి

బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు.

Sitaram Yechury : 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తాం – సీతారాం ఏచూరి

Sitaram Yechury

Sitaram Yechury : బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలిక లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ కమిటీ సమావేశాల్లో ఏచూరి పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను కేంద్ర కమిటీ ఆమోదించింది. రెండు నెలల ముందు పార్టీ కాంగ్రెస్ లో బహిరంగపరుస్తామని చెప్పారు. ఏవైనా సవరణలు ఉంటే చేస్తామన్నారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కన్నూర్ లో పార్టీ కాంగ్రెస్ జరుగుతుందని ఏచూరి తెలిపారు.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏచూరి ఫైర్ అయ్యారు. ప్రస్తుత సమయంలో బీజేపీకి వ్యతిరేకత పెరిగిందన్నారు. బీజేపీ ఓటమి లక్ష్యంగా వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తామన్నారు. ప్రస్తుత సమయంలో బీజేపీకి వ్యతిరేకత పెరిగిందన్నారు. బీజేపీ ఓటమి లక్ష్యంగా వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటామని, 5 రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా కృషి చేస్తామని ఏచూరి చెప్పారు.

అన్ని విషయాల్లో, రంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఏచూరి విమర్శించారు. కోవిడ్ ను అరికట్టడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మరోపక్క ఆర్థిక సంక్షోభం పెరుగుతోందన్నారు. ఉపాధి కల్పన ఊసే లేదన్నారు. పెట్రోలియం ధరలు భారీగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని సహా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.

”ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా బీజేపీ పన్నాగం పన్నుతోంది. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. ప్రతి పౌరుడు రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చూడాలి. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం. ప్రత్యామ్నాయ ఫ్రంట్.. ఎన్నికల తర్వాతే ఉంటుంది. పంజాబ్ లో ప్రధాని వెళ్లాల్సిన సమావేశంలో ప్రజలు రాలేదు. కానీ ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి” అని సీతారాం ఏచూరి అన్నారు.

Coffee Tea : కాఫీ తాగటం మంచిదా?..టీ తాగటం మంచిదా?

బీజేపీని వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే వారితో ముందుకెళతామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొని ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని సూటిగా వ్యతిరేకించడం లేదన్నారు. కొన్ని విషయాల్లో మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బీజేపీ సాఫ్ట్ కార్నర్ కు మేం వ్యతిరేకం అని తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు.