PM Modi : ఒలింపిక్స్‌లో భారత హాకీ జ‌ట్టు ఓట‌మిపై..ప్రధాని ఏమన్నారంటే..

భారత హాకీ జ‌ట్టు ఓట‌మి..ప్రధాని మోడీ స్పందించారు. జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగం..టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు బాగా ఆడ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఫైనల్స్ కు వెళ్లటానికి వారి ఆడిన తీరు..గెలవాలనే వారు తపనపడ్డారని అది చాలా మంచి విషయం అని అన్నారు.

PM Modi : ఒలింపిక్స్‌లో భారత హాకీ జ‌ట్టు ఓట‌మిపై..ప్రధాని ఏమన్నారంటే..

Wins & Losses Are Part Of Life

Wins & Losses Are Part Of Life: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ పోరాడి ఓడింది. సెమీ ఫైనల్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల అనంతరం హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు అడియాసలు అయ్యాయి. ఎంతగానో శ్రమించి సెమీ ఫైనల్స్ కు చేరుకున్న క్రీడాకారులు కూడా ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు.

ఈ రోజు ఉదయం జ‌రిగిన‌ తొలి సెమీస్‌ మ్యాచ్ లో బెల్జియం టీమ్ చేతిలో భారత హాకీ టీమ్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఫస్టాఫ్‌ ముగిసేసరికి 2-1తో లీడ్‌లో ఉన్న భార‌త్ ఆ త‌ర్వాత బాగా రాణించ‌క‌పోవ‌డంతో ఓట‌మి పాలై నిరాశను కలిగించింది. కానీ గెలుపు ఓటములు జీవితంలో భాగం. ఆటలో ఎవరో ఒకరే గెలుస్తారు.లేదా ఒక టీమే గెలుస్తుంది.

భారత హాకీ జ‌ట్టు ఓట‌మి..ప్రధాని మోడీ స్పందించారు. జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగం..టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు బాగా ఆడ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఫైనల్స్ కు వెళ్లటానికి వారి ఆడిన తీరు..గెలవాలనే వారు తపనపడ్డారని అది చాలా మంచి విషయం అని అన్నారు. కానీ ఓటమితో ఎవ్వరూ ఆగిపోకూడదు. గెలుపులు..ఓటములు సర్వసాధారణం.

తదుపరి మ్యాచ్‌‌తో పాటు భవిష్యత్‌‌లోనూ ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాన‌ని ప్రధాని మోడీ అన్నారు. సెమీ ఫైనల్ వరకూ వచ్చిన మన క్రీడాకారుల‌ను చూసి దేశం గర్విస్తోందని మోడీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు ఇక‌ కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మ‌రోవైపు రెండో సెమీఫైనల్లో జర్మనీ-ఆస్ట్రేలియా జట్లు పోటీ ప‌డ‌నున్నాయి.