Husband Murder: మంగళసూత్రం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో మొగుడి హత్య

భర్తను చంపడానికి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టేసింది వివాహిత. మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు షాక్ అయిపోయారు తెలిసిన వాళ్లంతా.. భర్తను కడతేర్చిన మహిళతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ మరో ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.

Husband Murder: మంగళసూత్రం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో మొగుడి హత్య

Arrested

Husband Murder: భర్తను చంపడానికి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టేసింది వివాహిత. మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు షాక్ అయిపోయారు తెలిసిన వాళ్లంతా.. భర్తను కడతేర్చిన మహిళతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ మరో ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.

శ్రుతి గంజి అనే మహిళ తన మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి రూ.1లక్ష వరకూ పోగు చేసింది. వాటిని సుపారీగా ఇచ్చి భర్తను చంపేయాలని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ డబ్బులు అవసరమవడంతో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్న డబ్బును విడిపించుకుని రూ.3లక్షలు విడుదల చేసుకుంది.

ఇదంతా జరగడానికి కొద్ది రోజుల ముందే తనకు విడాకులు ఇప్పించాలని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటానని చెప్పింది. దానికి నిరాకరించిన భర్త.. ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాడు. అతనితో వైవాహిక జీవితానికి విసుగు చెందిన శ్రుతీ.. ఆమె ఫ్రెండ్ అయిన ప్రియా నికమ్ ను కాంటాక్ట్ అయింది.

అప్పుడే కాంట్రాక్ట్ కిల్లర్ సంతోష్ రెడ్డి గురించి తెలిసింది. హంతకుడు సంతోష్ తో పాటు మహిళను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తుండగా మిగిలిన ఇద్దరి గురించి విచారణ జరుగుతుంది.

హతుడు ప్రభాకర్ కు చెందిన ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు సంతోష్ రెడ్డి. భీవండీ నుంచి ఐరోలీ వెళ్లాలని చెప్పడంతో ట్యాక్సీ వచ్చింది.

అలా వెళ్తున్న వారు మంకోలీ నాకా ప్రాంతానికి వెళ్లగానే ఆహారం కొనేందుకు కార్ ఆపమని చెప్పాడు సంతోష్. కార్ ఆగిన వెంటనే అతనితో తెచ్చుకున్న నైలాన్ తాడును మెడకు బిగించి ఘటనాస్థలంలోనే హత్య చేశాడు. నిందితులు ఎటువంటి వేలిముద్రలు లేకుండా ముందే జాగ్రత్తపడ్డారని పోలీసులు చెబుతున్నారు.

హత్య గురించి జరిపిన విచారణలో సాక్ష్యాలు లేనప్పటికీ శ్రుతి ఇచ్చిన సమాధానాలను బట్టి ఘటన పూర్తి వివరాలు తెలిశాయని పోలీసులు చెప్పారు. తానే భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చానంటూ చెప్పేసింది.