ప్రేమ పేరుతో మహిళా ఎస్సైతో లైంగికంగా కలిసి…. పెళ్లి అనే సరికి పరారైన ఎస్సై

  • Published By: murthy ,Published On : August 25, 2020 / 04:24 PM IST
ప్రేమ పేరుతో మహిళా ఎస్సైతో లైంగికంగా కలిసి…. పెళ్లి అనే సరికి పరారైన ఎస్సై

సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాం. కానీ పోలీస్ స్టేషన్ హెడ్ అయిన సబ్ ఇన్సెక్టర్ నే మోసం చేస్తే ఆమె డీజీపీ కి ఫిర్యాదు చేసింది.



ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి, తీరా  లైంగికంగా కలిశాక పెళ్ళిమాటేత్తే సరికి పరారైన ఎస్సై ఉదంతం ఒడిషాలో వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ బాధితురాలు, నిందితుడు ఇద్దరూ చట్టాన్ని రక్షించాల్సిన ఎస్సై హోదాలో ఉద్యోగాలు చేస్తున్న వారే.

ఒడిషాలోని గంజాం జిల్లా ఖాళీకోట్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సిలుధల్, 2017 లో బిజు పట్నాయక్ స్టేట్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకునే రోజుల్లో, సహ ఉద్యోగి  అయిన బాధిత మహిళా ఎస్సైని ప్రేమిస్తున్నాని వెంట పడ్డాడు. బాధిత ఎస్సై అతని కంటే తక్కువ కులస్తురాలవటం వల్ల అతడి ప్రేమను తిరస్కరించింది. అయినా అతడు వదిలి పెట్టకుండా ఆమె  వెంట పడ్డాడు.



శిక్షణ పూర్తయిన తర్వాత ఆమెకు సంబల్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పోస్టింగ్ వచ్చింది. అక్కడ విధులు  నిర్వహిస్తున్న ఆమెకు వాట్సప్ లో ప్రేమిస్తున్నానంటూ మెసేజ్ లు పంపటం  మొదలెట్టాడు. సిలుధల్ పంపే ఏ మెసేజ్ కు ఆమె సమాధానం ఇవ్వక పోయే సరికి ఒకసారి సంబల్ పూర్ వచ్చాడు. ఆ తర్వాత తరచూ ఆమె ఇంటికి వచ్చి తన ప్రేమను వ్యక్త పరుస్తూ ఉన్నాడు.

ఈక్రమంలో ఒకరోజు బలవంతం చేసి ఆమెతో లైంగికంగా కలిశాడు. జరిగిన తప్పుకి ఆరోజు రాత్రంతా ఆమె ఏడూస్తూనే ఉంది. తాను మోసం చేయనని పెళ్లి చేసుకుంటానని ఆమెకు వాగ్దానం  చేశాడు.



పెళ్లి కాకుండా ఎస్సై తనపై లైంగిక దాడి చేయటంతో ఆ మహిళా ఎస్సై పెళ్లిచేసుకుందామని సిలుధల్ ను వత్తిడి చేయసాగింది. దాంతో అతడు ఆమెను తప్పించుకు తిరగటం మొదలెట్టాడు. ఓసారి నిలదీసి అడిగేసరికి పెళ్లి చేసుకోటానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన ఆమె ఎస్సై సిలుధల్ పై డీజీపీ కి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేయటంతో నిందితుడు సిలుధల్ పరారీలో ఉన్నాడు.