మహిళపై వేధింపుల కేసు…అమ్మాయిని ట్రైన్‌లో తోసేసి షర్ట్ చింపేసిందుకు….

మహిళపై వేధింపుల కేసు…అమ్మాయిని ట్రైన్‌లో తోసేసి షర్ట్ చింపేసిందుకు….

రైలులో వెళ్తుండగా జరిగిన వివాదంలో 20ఏళ్ల యువతి షర్టును చింపేసింది 38ఏళ్ల మహిళ. ఈ ఘటన కండివిలీ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం జరిగింది. బొరివిలీ గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ)పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలాద్ లో ఉంటున్న యువతి కాలజీకి వెళ్లేందుకు కండివిలీ రైల్వే స్టేషన్‌కు పోయే రైలు ఎక్కింది. 

దిగాల్సిన స్టేషన్ సమీపిస్తుండటంతో రైలు వేగం తగ్గింది. ఆ సమయంలో దిగేందుకు ప్రయత్నించింది. పూర్తిగా రైలు ఆగకముందే వెనుక ఉన్న జ్యోతి శర్మ ట్రైన్‌లో నుంచి యువతిని తోసేసింది. కిందకు దిగిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో ఆగకుండా యువతి షర్ట్ విప్పేసింది.

మహిళ చేసిన పనికి తన శరీరం అందరిముందు ఎక్స్‌పోజ్ అయిందని యువతి ఫిర్యాదుచేసింది. ఈ ఘటన తెలిసి జ్యోతి శర్మ పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన పోలీసులు స్టేషన్ దాటి వెళ్లకముందే పట్టుకున్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) పలు సెక్షన్ల ప్రకారం.. నిందితురాలిపై కేసులు నమోదయ్యాయి.