లంచం అడిగాడని…నడిరోడ్డుపై చెప్పుతో చితక్కొట్టింది

అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.

  • Published By: venkaiahnaidu ,Published On : May 8, 2019 / 04:47 AM IST
లంచం అడిగాడని…నడిరోడ్డుపై చెప్పుతో  చితక్కొట్టింది

అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.

అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50వేల కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది. డబ్బులు ఇస్తానంటూ ఫోన్ చేసి పిలిచి ఏసీబీ అధికారిగా చెప్పుకునే వ్యక్తిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా చెప్పుతో ఆ వ్యక్తికి బడిత పూజ చేసింది.

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్ పూర్ లోని మాంగో ఏరియాలో ఈ ఘటన జరిగింది. మహిళ బంధువులు కూడా నడిరోడ్డులో ఆ వ్యక్తిని కర్రతో చితకబాదారు. మహిళ ఇచ్చిన సమాచారంతో ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు సాయం చేస్తానంటూ ఏసీబీ అధికారిగా చెప్పుకునే ఓ వ్యక్తి 50వేలు డిమాండ్ చేశాడని మహిళ కంప్లెంట్ చేసినట్లు మాంగో ఎస్సై అరుణ్ మెహతా తెలిపారు. అతని దగ్గర ఫేక్ ఐడీ కార్డులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.